శనీశ్వరుని చరిత్ర

 _*శనీశ్వరుని చరిత్ర*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



జ్యోతీష్య శాస్త్రం ప్రకారం *'శని'* నవగ్రహాలలో ఒక గ్రహం. సూర్యుడు , చంద్రుడు , ఛాయాగ్రహాలైన రాహువు మరియు కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది. గగనమండలంలో ఉన్నగ్రహాలకుభూమితో సంబంధం ఉంది. కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమిమీద , భూమిపై ఉన్న ప్రతి చరాచర జీవుల పైన , నిర్జీవ , ఝడ , నిర్లిప్త వస్తువుల మీద వుంటుంది. నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం ఇందుకు భిన్నం కాదు. శని , శనిగ్రహం , శనైశ్ఛరుడు , అని పలు నామములతో పిలువబడి , గ్రహరూపలో పూజింపబడే *'శని'* ఒక గ్రహదేవుడు. వారంలో ఏడవవారం శనివారం. శనివారానికి అధిపతి శనిభగవానుడు.


సంఖ్యాశాస్త్రం ప్రకారం '8' శనికి ప్రీతికరమయిన సంఖ్య. *శని జననం* *శని తల్లిదండ్రులు: సకల జీవులకు ప్రత్యక్షదైవం అయినట్టి సూర్యుడుభగవానుడికి , అతని రెండవ భార్య ఛాయదేవికి పుట్టిన సంతానం శని. ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది. జీవుల జాతకాలపై తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో తెలియజేయడానికి సూచనగా , ఆయన జననం సూర్య గ్రహణములోజరిగింది.*


*ఇతర నామాలు: ఇతనికి మందగమనుడు అని కూడా పేరు. శనయే క్రమతి స:  అనగా అతినెమ్మదిగా కదిలేవాడు అని అర్థం. ఒకసారి సూర్యుని చుట్టిరావడానికి శనికి 30 సంవత్సరాలు పడుతుంది. శానైస్కర్య , అసిత , సప్తర్చి , క్రూరదృష్ట , క్రూరలోచనుడు , పంగు పాదుడు , గృద్రవాహనుడు మొదలైన పేర్లుకూడా ఉన్నాయి. శనీస్వరునికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు: నువ్వులు , నువ్వుల నూనె , నల్లటి వస్త్రం , నీలం , ఇనుము , అశుభ్రత, మందకొడిగా ఉండటం. ధర్మ రక్షకుడు* కాకి వాహనముపై శని దేవుడు సమస్త ప్రాణకోటి యొక్క పాపకర్మల ఫలాన్ని వెను వెంటనే నెరవేర్చే దేవుడు . జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి , శిక్షించి , ధర్మాన్ని నిలిపే శనిభగవానుడు యమధర్మరాజుకు మరియు యమునకు అగ్రజుడు. వీరి ముగ్గురి శరీర ఛాయ నలుపే. సూర్యుని కుమారులైన శని మరియు యముడు , ఇరువురూ న్యాయాధిపతులే. యముడు మరణానంతరం దండనలు విధిస్తే , శని , జీవులు బ్రతికి ఉండగానే హింసించి , యాతనలకు గురిచేసి శిక్షిస్తాడు. గుణపాఠం నేర్పించే విషయంలో శనికి ఎవరూ సాటి లేరు. ద్రోహం , వెన్నుపోటు , హింస , పాపమార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి. తన దృష్టి పడ్డవారిని హింసించి , నానాయాతనలకు గురిచేసి , అత్యంత కౄరంగా అమిత బాధలకు గురిచేసే శనిదేవుడు , తను కరుణించిన వారిని అందలం ఎక్కించే శ్రేయోభిలాషి అని శాస్త్రాలు వర్ణించాయి. నల్లని ఛాయ అతని మేని వర్ణం. నల్లని వస్త్రములు అతని ఉడుపులు. ఖడ్గము , బాణములు మరియు రెండు బాకులు అతని ఆయుధాలు. నల్లని కాకి అతని వాహనం. శనిభగవానుడు సహజంగా నల్లటి ఛాయ కలవాడని , ఛాయా , మార్తాండ సంభూతుడని , అందమైన ముఖం కలవాడుగాను, క్రూరుడిగాను , మందగమనుడిగాను , గానుగుల కులానికి చెందినవాడుగాను , కాల - భైరవుడికి మహాభక్తుడిగాను హిందూ పురాణాలు జ్యోతిష శాస్త్రాలలో వర్ణింపబడ్డాడు .


*శని మహత్యం , శనీశ్వర జపం , శనీశ్వరుడి జప మంత్రాలు* 


*నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం ||*


 || ఓం శం శనయేనమ:|| 

|| ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ || 

|| ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్చరాయ నమః || 


*శని గాయత్రీ మంత్రం:*


ఓం కాకథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్. || ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ || బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన 


*"నవగ్రహ పీడహర స్తోత్రం":* 


||సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మే శని: || ||ఓం శం శనైస్కర్యయే నమః|| ||ఓం శం శనైశ్వరాయ నమః|| ||ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ శ: శనయే నమః || ||కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:|| ఓం నమో శనైశ్వరా పాహిమాం , ఓం నమో మందగమనా పాహిమాం , ఓం నమో సూర్య పుత్రా పాహిమాం , 

ఓం నమో చాయాసుతా పాహిమాం , 

ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం , 

ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం , 

ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం శనిగ్రహ జపం ఆవాహము అస్యశ్రీ శనిగ్రహ మహా మంత్రస్య హిళింభి ఋషిః శనైశ్చర గ్రహోదేవతా! ఉష్టిక్ చంధః! శనైశ్చర గ్రహ ప్రసాద సిద్దర్ధ్యే శనిపీడా నివారణార్ధే శనిమంత్ర జపే వినియోగః కరన్యాసం ఓం శమగ్ని - అంగుష్టాభ్యాసం నమః ఓం అగ్నిభిస్కరత్ - తర్జనీభ్యాం నమః ఓం విష్ణుశంనస్తపతుసూర్యః - మధ్యమాభ్యాం నమః ఓం శంవాతః - అనామికాభ్యాం నమః ఓం వాత్వరపాః - కనిష్ఠికాభ్యాసం నమః ఓం అపశ్రిధః - కరతల కరపృష్టాభ్యాసం నమః 


*అంగన్యాసము:* ఓం శమగ్ని: - హృదయాయ నమః ఓం అగ్నిభిస్కరత్ - శివసేస్వాహ ఓం శంనస్తపతుసూర్యః - శిఖాయైవషట్ ఓం శంవాతః - కవచాయహు ఓం వాత్వరపాః - నేత్రత్రయాయ వౌషట్ ఓం అపశ్రిధ్ర - అస్త్రాయఫట్ ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధం ఆదిదేవతాః ఇమం యమ ప్రస్తరమాహి సీదాంగి రోభి: పితృభిప్సం విధానః! అత్వా మంత్రాః కవిసహస్త్వా వహ న్వైనారాజన్ హవిషామదయస్వ!!


*ప్రత్యథి దేవతా:* ప్రజాపతే సత్వ దేవతాన్యోన్యో విశ్వాజాతాని పరితాబభూవ! యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తువయగ్గౌ శ్యామ పతయోరయీణాం!!


*వేదమంత్రం* ఓం శమగ్ని రాజ్ఞి భిస్క రచ్చన్న స్తపతు సూర్యః శం వాతో వాత్వరపా అపశ్రిధః శని కవచ స్తోత్రము శనైశ్చరశ్శిరో రక్షేత్! ముఖం భక్తార్తి నాశనః కర్ణౌకృష్ణాంబరః పాతు! నేత్రే సర్వ భయంకరః!! కృష్ణాంగో నాసికాం రక్షేత్! కర్ణౌ మేచ శిఖండిజ:! భుజౌమే సుభుజః పాతు! హస్తా నీలోత్పల ప్రభః! పాతుమే హృదయం కృష్ణ:! కృక్షిం శుష్కోధర స్తధాః! కటిం మే వికటః పాతు! ఊరూ మే ఘోర రూపవాన్! జానునీ పాతు దీర్ఘోమే! జంఘేమే మంగళ ప్రభః! గల్పౌ గణాకరః పాతు! పాదౌ మే మంగుపాదకః! సర్వాణిచ మామాచంగాని! పాతు భాస్కరనందనః! 


*ఫలశ్రుతి* య ఇదం కవచం దివ్యం సర్వ పీదాహరం ణాం పఠతి శ్రద్ధయా యుక్తః! సర్వాన్ కామానవాప్నుయాత్! శని మంగళాష్టకమ్ మందః కృష్ణవిభస్తు పశ్చిమ ముఖః సౌరాష్టవో కాస్యవః! నక్రేశో ఘటన సుహృద్భుధ భ్రుగుర్వైరీంద్వ వక్ష్యాసుతః!! స్థానం పశ్చిమ దిక్ర్పజాపతిర్యమౌదేవౌ ధనస్త్వాసనం! షట్రష్ట స్శుభకృచ్ఛమీ రవిసుతః కూర్యాత్సదా మంగళం!!


*శన్యష్టోత్తర శతమామావళి*


🌚🌚🌚🌚🌚🌚🌚🌚🌚


ఓం శనైశ్చరాయ నమః ఓం శాంతాయ నమః 

ఓం శరణ్యాయ నమః 

ఓం వరేణ్యాయ నమః 

ఓం సర్వేశాయ నమః 

ఓం సౌమ్యాయ నమః 

ఓం సురవంద్యాయ నమః ఓం సురలోక విహారిణే నమః 

ఓం సుఖాననోవిష్టాయ నమః ఓం సుందరాయ నమః ఓం ఘనాయ నమః ఓం ఘనరూపాయ నమః 

ఓం ఘనాభరణధారిణే నమః 

ఓం ఘనసారవిలేపాయ నమః 

ఓం ఖద్యోతాయ నమః ఓం మందాయ నమః 

ఓం మందచేష్టాయ నమః ఓం మహనీయగుణాత్మనే నమః 

ఓం మర్త్యపావనపాదాయ నమః 

ఓం మహేశాయ నమః 

ఓం ఛాయాపుత్త్రాయ నమః ఓం శర్వాయ నమః ఓం శ్రతూణీరధారిణే నమః 

ఓం చరస్థిరస్వభావాయ నమః 

ఓం చంచలాయ నమః ఓం నీలవర్ణాయ నమః ఓం నిత్యాయ నమః 

ఓం నీలాంబసనిభాయ నమః 

ఓం నీలాంబరవిభూషాయ నమః 

ఓం నిశ్చలాయ నమః ఓం వేద్యాయ నమః 

ఓం విధిరూపాయ నమః ఓం విరోధాధార భూమయే నమః 

ఓం వేదాస్పదస్వాభావాయ నమః 

ఓం వజ్రదేహాయ నమః ఓం వైరాగ్యదాయ నమః ఓం వీరాయ నమః 

ఓం వీతరోగభయాయ నమః 

ఓం విపత్పరంపరేశాయ నమః ఓం విశ్వనంద్యాయ నమః ఓం గృద్రహహాయ నమః ఓం గుధాయ నమః ఓం కూర్మాంగాయ నమః ఓం కురూపిణే నమః 

ఓం కుత్సితాయ నమః ఓం గుణాధ్యాయ నమః ఓం గోచరాయ నమః 

ఓం అవిద్యామూలనాశాయ నమః 

ఓం విద్యావిద్యాస్వరూపిణే నమః 

ఓం ఆయుష్యకారణాయ నమః 

ఓం ఆపదుద్దర్త్రే నమః ఓం విష్ణుభక్తాయ నమః ఓం వశినే నమః 

ఓం వివిధాగమనేదినే నమః 

ఓం విధిస్తుత్యాయ నమః ఓం వంద్యాయ నమః 

ఓం విరూపాక్షాయ నమః ఓం వరిష్టాయ నమః 

ఓం వజ్రాంకుశధరాయ నమః 

ఓం వరదాయ నమః 

ఓం అభయహస్తాయ నమః 

ఓం వామనాయ నమః ఓం జేష్టాపత్నీసమేతాయ నమః ఓం శ్రేష్టాయ నమః ఓం అమితభాషిణే నమః ఓం కస్టౌఘనాశకాయ నమః 

ఓం ఆర్యపుష్టిదాయ నమః 

ఓం స్తుత్యాయ నమః 

ఓం స్తోత్రగమ్యాయ నమః ఓం భక్తివశ్యాయ నమః ఓం భానవే నమః 

ఓం భానుపుత్త్రాయ నమః ఓం భావ్యాయ నమః ఓం పావనాయ నమః ఓం ధనుర్మందల సంస్థాయ నమః 

ఓం ధనదాయ నమః 

ఓం ధనుష్మతే నమః 

ఓం తనుప్రకాశ దేహాయ నమః ఓం తామసాయ నమః 

ఓం అశేషజనవంద్యాయ నమః 

ఓం విశేషఫలదాయినే నమః 

ఓం వశీకృతజనిశాయ నమః 

ఓం పశూనాంపతయే నమః 

ఓం ఖేచరాయ నమః 

ఓం ఖగేశాయ నమః 

ఓం ఘననీలాంబరాయ నమః 

ఓం కాఠిన్యమానసాయ నమః 

ఓం అరణ్యగణస్తుత్యాయ నమః 

ఓం నీలచ్చత్రాయ నమః ఓం నిత్యాయ నమః 

ఓం నిర్గుణాయ నమః 

ఓం గుణాత్మనే నమః 

ఓం నిరామయాయ నమః ఓం నింద్యాయ నమః 

ఓం వందనీయాయ నమః ఓం ధీరాయ నమః 

ఓం దివ్యదేహాయ నమః ఓం దీనార్తి హరణాయ నమః ఓం దైన్య నాశకరాయ నమః 

ఓం ఆర్యజనగణణ్యాయ నమః ఓం క్రూరాయ నమః ఓం క్రూరచేష్టాయ నమః 

ఓం కామక్రోధకరాయ నమః 

ఓం కళత్రపుత్త్రశత్రుత్వ కారణాయ నమః 

ఓం పరిపోషితభక్తాయ నమః 

ఓం భక్త సంఘమనోభీష్ట ఫలదాయ నమః 

ఓం శ్రీమచ్ఛనైశ్చరాయ నమః 


*శనీశ్వరుడు ప్రసన్నుడవాలంటే*


కంటక శని : (చాంద్రయానాన్ని అనుసరించి జన్మరాశి నుండి ఎనిమిదవ ఇంటిలోనికి శని ప్రవేశించినప్పుడు) లేదా , ఏలినాటి శని: (చాంద్రయనాన్ని అనుసరించి జన్మరాశి నుండి పన్నెండు , మొదటి మరియు రెండవ ఇంటిలోనికి శని యొక్క గమన సమయంలో) ఉన్నా శని ప్రస్సనుడవాలంటే:


అమావాస్య రోజున కాళీ మాత పూజ చేయాలి. విష్ణువును , కృష్ణుని రూపంలో ధ్యాన్నిస్తూ *'ఓం నమో నారాయణాయ', 'హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే..' అని జపించాలి.హనుమంతుడిని సర్వోత్కృష్టమైన (అనంతమైన) రూపంలో ధ్యానించాలి. శని, హనుమంతుని వీపుపై , చేరి అతన్ని పట్టి పీడించాలని ప్రయత్నించినప్పుడు , తన బలంఅంతా ఉపయోగించి , ఒక్క విదిలింపుతో శనిని , విసిరి పారేసినప్పుడు సూర్య భగవానుడు , హనుమంతుడిని మెచ్చుకుని, "నిన్ను పూజించిన వారికి శని బాధలుండవు" అని దీవించాడట. శనిత్రయోదశి , శనిజయంతి మరియు శనిఅమావస్య రోజులలో తిలాభిషేకం చేయాలి. బ్రాహ్మణునికి నల్ల నువ్వులు దానం చేయాలి.నల్ల గోవు (కపిల గోవు) కు బెల్లం మరియు నువ్వుల మిశ్రమాన్ని తినిపించాలి. శనివారాలలో (శ్రావణ మాసంలో తప్పనిసరిగా) ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉండాలి. కాకులకు ఉదయం , మధ్యాహ్న వేళాలలో అన్నం పెట్టాలి. వికలాంగులైన వారికి ఆహారం అందివ్వాలి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. శని క్షేత్రాలు సందర్శించాలి. ప్రతిరోజూ సూర్యాస్తమయం తరువాత ఇంటి ముఖద్వారం వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. దశరథ మహారాజ కృత శని స్తోత్రమును పఠించాలి.శ్రావణ పూర్ణిమ నాడు, జ్యేష్టాదేవికి, శనీశ్వరుడికి కళ్యాణం జరిపించాలి. మూలమంత్రం, పునర్చరణ , హవనం , దానములతో పాటుగా 19000 సార్లు శనిజపం చేయటం మంచిది. శ్రావణమాసలో , శనివారాలలో శనైశ్చరవ్రతం , హోమం చేయటం చాలా మంచిది. శనైశ్చర దీక్ష , శ్రావణ శుద్ధ విదియ నుండి శ్రావణ బహుళ షష్ఠి వరకు పూనాలి. 'రామ నామం' , హనుమాన్ చాలీసా , దుర్గా స్తుతులను జపించటం. హనుమంతుడు , శ్రీ దుర్గా దేవి , వినాయకులను ప్రార్థించటం ఎంతో మంచిది. పెరుగన్నం , దేవునికి నైవేద్యంగా పెట్టిన ఆతరువాత కాకులకు పెట్టాలి. అనాథ బాలలకు అన్నదానం చేయాలి. పై వాటిలో ఏది పాటించినా శని ప్రసన్నుడవుతాడు.  శని క్షేత్రాలు  శని శింగణాపూర్*


*దస్త్రం:పుజవిధి*


శని శింగణాపూర్: అహమద్ నగర్ జిల్లాలో , షిరిడి మరియు ఔరంగాబాద్ మహారాష్ట్ర మధ్యలో శని శింగణాపూర్ అనే శనిక్షేత్రం ఉంది. ఇక్కడ శని *"స్వయంభు" (సంస్కృతంలో స్వయముగా ఆవిర్భవించిన అని అర్థం). భూమి నుండి స్వయంగా ఉద్భవించిన నల్లని , గంభీరమైన రాతి విగ్రహం. కచ్చితంగా ఏ కాలానికి చెందినదో ఎవరికీ తెలియనప్పటికీ, స్తలపురాణం ప్రకారం స్వయంభు శనీశ్వరుడు అనాదిగా ఇక్కడ కొలువైయున్నాడు. కనీసం కలియుగం ప్రారంభం నుండి దీని ఉనికి ఉన్నట్టుగా భక్తులు నమ్ముతారు. నోటిమాట ద్వారా తరతరాలకు అందించబడిన ఈ స్వయంభు , గురించి 🌹స్తలపురాణం ప్రకారం:🌹 పూర్వం , ఒక గొర్రెల కాపరి పదునైన చువ్వతో ఒక చోట మట్టిని తవ్వుతుండగా అది ఒక రాతికి కొట్టుకుని , ఆ రాయి నుండి రక్తం స్రవించడం ప్రారంభమైంది. దీనితో గొర్రెల కాపరులు దిబ్రాంతి చెంది , భయంతో వూరిలోకి పరుగున వెళ్ళి అందరికి తెలిపాడు. వెంటనే పల్లె మొత్తం ఆ అద్భుతం చూచేందుకు గుమికూడి చర్చించుకున్నారు. కానీ ఎవ్వరికీ ఏమీ పాలుపోలేదు. ఆ రాత్రి, ఆ గొర్రెల కాపరి స్వప్నంలో శనీశ్వర స్వామి ప్రత్యక్షమైనాడు. తాను "శనీశ్చరుడి"నని, అద్వితీయముగా కనిపించుచున్న ఆ నల్లరాయి తన స్వయంభు రూపమని తెలిపినాడు. అంతట , ఆ గొర్రెలకాపరి స్వామిని ప్రార్థించి తాను స్వామికి ఆలయం ఎక్కడ , ఎలా నిర్మించాలో తెలుపమని ప్రార్తించాడట. దీనికి సమాధానముగా శని మహాత్ముడు ఆకాశం మొత్తం తనకు నీడ అని, తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బాహాటముగా ఉండుటకు ఇష్టపడతానని , కాబట్టి ఏ ఆలయనిర్మాణమూ అక్కరలేదని , ప్రతినిత్యం పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా 'తైలాభిషేకం' చేయమని చెప్పాడట. తను స్వయంభుగా వెలసిన ఆపల్లెకు ఇకమీదట బందిపోటుల , దోంగల , దోపిడిదారుల , కన్నము వేసే దొంగల భయం ఎప్పటికీ ఉండజాలదని మాట ఇచ్చి అదృశ్యం అయ్యాడట. ఇక్కడ శనీశ్చర స్వామిని , గుడిలో కాకుండా ఎటువంటి కప్పు లేని ఆరు బయట చూడవచ్చును. ఆంతేకాదు ఈ వూరిలో నేటికీ , (ఈ కలియుగంలో కూడా) ఏ ఇంటికి తలుపు లుండవు! దుకాణాలకు , ఇళ్ళకు , ఆలయాలకు , చివరికి ప్రభుత్వకార్యాలయాలకు కూడా తలుపులు ఉండవు!.  ఈ వూళ్ళో ఉన్న తపాలా కార్యాలయానికి కూడా తలుపులు , తాళాల లేకపోవడం మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. శనీశ్వరుడిని భగవానుని యందు భయముచే , శనిభగవానుని ఆలయము వద్ద ఒక కిలోమీటరు వ్యాసార్థం లోపల ఉన్న నివాస స్థలములు , గుడిసెలు , దుకాణములు మొదలైనవాటి వేటికి తలుపులు కాని తాళాలు కాని ఉండవు. శింగణాపూర్ అనబడే ఈ ఊరిలో ఎప్పుడూ కూడా దొంగతనము లేదా దోపిడి జరగలేదు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకుని చనిపోయారు. ఇతరులు చాలామంది దీర్ఘకాల అనారోగ్యం , మానసిక సమతుల్యత లేకపోవడం వంటి వివిధ రకాల శిక్షలు అనుభవించారు. శనీశ్వరుని కృపకు పాత్రులు కావాలనుకునే వేలమంది భక్తులు ప్రతిరోజూ ఈ శని శింగణాపూర్ లోని శనీశ్వరుడి దర్శనం చేసుకుంటారు. శనివారములలో ఈ స్థలం చాల రద్దీగా ఉంటుంది. శని త్రయోదశి స్వామికి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. అదే విధంగా 'అమావాస్య రోజున వచ్చే శనివారం శనీశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పరిగణింపబడుతుంది. ఆయన దీవెనల కోసం వేలమంది భక్తులు ఈ ఆలయం వద్ద గుమికూడతారు.*


*దేవనార్ దేవనారు లోని శని దేవాలయం:*


ముంబైలోని దేవనారు ప్రాంతంలో ఒక శనీశ్వరాలయం ఉంది. ఈ ఆలయం (ముంబై - పూణే - బెంగుళూరు)   ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్హైవే మీద గోవండి , దేవనార్ - చెంబూరు కూడలి వద్ద శివాజి విగ్రహానికి తూర్పున నెలకొని ఉంది. ఈ ప్రామంతానికి అసలు పేరు *"దేవనవరు"* అంటే దేవుడు గారు అని అర్థం. కాలాంతరంలో తమిళ బాషా ప్రభావం వల్ల దేవనార్ గా మార్పు చెందింది. ఈ ఆలయంలో కొలువున్న దేవుడు శనీశ్వర స్వామి: అందమైన , శక్తివంతమైన , గుబురు మీసాలతో కొట్టొచ్చినట్టున్న గంభీరమైన ఏడడుగుల నల్లని విగ్రహం రూపం. అనేకమంది శని దోషం గల భక్తులు , లేదా శని మహర్దశ , ఏలినన్నాటి శని దోషం ఉన్నవారు ఈ ఆలయంలో తైలాభిషేకం చేసుంటారు. ముఖ్యంగా శనివారల్లో నువ్వుల నూనెను అత్యంత భక్తిశ్రద్ధలతో శిరస్సునుంచి పాదాలవరకు విగ్రహం నూనెతో కప్పబడే విధంగా తైలాభిషేకం చేస్తారు. ఈ నూనెతో పూజ చేసినట్లయితే శనీశ్వరుడు ప్రసన్నుడు అవుతాడని నమ్మకం. అలాగే జిళ్ళేడు ఆకుల మాలలను ఆంజనేయస్వామికి సమర్పించుకుని , శివునికి జలాభిషేకం చేయడం ఇక్కడి వారి ఆనవాయతి.


ప్రతి శనివారం సుమారు ఉదయం 10:30 గంటల సమయంలో , పూజారి మహా హారతి ఇచ్చిన వెంటనే , పెద్ద పూజారిలో ('స్వామి' అని ప్రియంగా పిలుస్తారు అందరు) ఓ విధమయిన తన్మయత్వంలో వూగిసలాడాడం ప్రారంభం అవుతుంది. అకస్మాత్తుగా , ఆలయంలో వాతావరణం మారుతుంది. పూనకం అంటే మామూలుగా వుండే అరుపులు , ఆర్భాటాలు వుండవు. ఆయన కళ్ళు మూసుకుని తన్మయత్వం లోకి (ట్త్రాన్స్) లోకి వెళ్ళిపోతాడు. ఆ ఉత్కంట భరిత వాతావరణాన్ని అక్కడ వున్న ప్రతి ఒక్కరు చూడవచ్చు. అనుభవించవచ్చు. ఆ అలయంలోని మిగతా వారు మెల్లగా *'స్వామి ని నడిపించుకుంటూ '* *'మొనలు తేలిన, పదునైన , పొడవాటి మేకులతో చేయబడిన కుర్చీపై కూర్చో పెడతారు . కాళ్ళు మరియు చేతులు ఆనించే స్తలంలో కూడా ఆ కుర్చీకి పదునైన మేకులు బిగించి ఉంటాయి. స్వామి శరీరంపైకి శనీశ్వరుడు వచ్చినపుడు , ఆయన ఎక్కువ సమయం కళ్ళు మూసుకుని దాదాపు ఆరోజు మొత్తం ఆ కుర్చీ పైనే కుర్చుని ఉంటాడు. కొన్ని శనివారాలలో ఆయన 12 నుండి 13 గంటల పాటు ఏకథాటిగా ఆ కుర్చిపైన కూర్చున్నా ఎటువంటి బాధ కాని , అసౌకర్యము గాని ఆయన ముఖంలో కనిపించదు. అటు తరువాత భక్తులు 'స్వామి' ముందు నిశ్శబ్దముగా కూర్చుంటారు. వారు ఒక జత నిమ్మకాయలు చేతిలో ఉంచుకుని , క్యూలో వారి వంతు వచ్చే వరకు నిరీక్షిస్తూ వుంటారు. స్వామి ఒకరి తరువాత ఒకరిని వంతుల వారిగా తన వద్దకు రమ్మని సైగ చేయుగానే , జనం తమ వద్ద ఉన్న పసుపుపచ్చ నిమ్మకాయల జతను ఆయన ముందు ఉంచుతారు. ఆయన వారి సమస్యలు, వేదనలు లేదా క్షోభ లేదా మరేదైనా సరే వారు చెప్పేది ఓర్పుతో వింటారు. ఆ తరువాత ఆయన వారి వేదన /సమస్య / క్షోభలకు గల కారణాలను విసిదీకరించి వివరిస్తారు.. అది వారి 'ప్రారబ్ధం' కావచ్చు, గతంలో చేసిన కర్మలు (పనులు) ప్రస్తుత జన్మలోనకి మోసుకు రాబడి వుండవచ్చు లేదా స్వామి వివరించినట్టుగా , వారి సమస్యలు ఈ జన్మలోనే అతను (లేదా ఆమె) చేసిన పనులు లేదా కర్మల యొక్క ఫలితం కావచ్చు. కొన్ని సందర్భాలలో అది వారి శత్రువులు లేదా చెడు కోరుకునేవారిచే చేయబడిన వామాచార ప్రయోగం కూడా కారణం కావచ్చు. ఈ శని దేవాలయ ప్రాంగణములో హనుమంతుడు , జగదీశ్వరుడు , సాయిబాబా , మరియు మాత విగ్రహాలేకాక నవగ్రహ మండపం కూడా ఉంది. గర్భగుడిలో జేష్టాదేవి సమేతుదైన శనీశ్వరస్వామి యొక్క విగ్రహానికి ఎడమవైపున హనుమంతుడు కుడివైపున జగదీశ్వరస్వామి విరాజిల్లుతున్నారు.


*వేదాలలో శని* 


వేదము ఋక్కులలో శుక్ర బృహస్పతి ఉన్నారు. అందులోనే శుక్ర - మంధిక్ - పదములు గ్రహార్ధకములుగా కనిపించును. తత్తిరీయ సంహిత అందు గ్రహశబ్దమునకు యజ్ఞపాత్ర అని అర్ధము. ఐతిరేయ , శతపధబ్రాహ్మణము నందలి గ్రహ శబ్దమునకు సోమరసము గ్రహించు పాత్ర అని అర్ధము. అయితిరేయ బ్రాహ్మణమున సోమపాత్రలు తొమ్మిది , గ్రహములను తొమ్మిది. సోమరసమును గ్రహించును కావున గ్రహ మనగా సోమ - పానపాత్ర.


సూర్యాదులయెడల గ్రహ శబ్దము ప్రసిద్ధము. గ్రహశబ్దమునకు గ్రహణ మనియు అర్ధము ఉంది. *భానోర్ గ్రహే, సకలగ్రహే* అని సూర్యసిద్ధాంతము. సూర్యగ్రహణమునకు సూర్యుని గ్రహించుట. రాహువు ఆక్రమితును కావున రాహువు గ్రహము. అన్ని మన్వంతరములందును అందరు దేవతలను సుర్యనక్షత్రములను ఆశ్రయించుకొని యుందురని పురాణములు చెప్పును. చంద్రసూర్యాదులు గ్రహములు. పుణ్యపురుషులకు నక్షత్రములవలెనే దేవతలకీ సూర్యచంద్రాదులు గృహములు. చంద్రుడు, సూర్యుడు మొదలగు తేజ పిండములనుద్దేశించి యజ్ఞములందు వేరువేరు పాత్రలకు వాడుక ఉంది. కాలక్రముమున ఆపేరులే తేజ్ఃపిండములకు వాడుక ఆయెను. గ్రహముల పరస్పర సామీప్యముగాని , గ్రహనక్షత్రముల సామీప్యముగాని కలిగినప్పుడు సంగ్రామము కలుగును. క్రాంతివృత్తమున ఉత్తరార్ధమున దేవగణమును , దక్షిణార్ధమున అసురగణమును ఉండునని ప్రసిద్ధము. ఇవియే గ్రహముల సంధానము. *శని* తొలిసృష్టిలో వేడికి సకలచరాచరముల మలమల మాడిపోవుచున్నప్పుడు బ్రహ్మ సూర్యుని జూచి దేవతలే నీవేడిమి కాగలేకున్నారు;  ఇక మానవుల లెక్కయేమి అని అనగా సుర్యునకు కోపము వచ్చెనట అందులకె శని పుట్టెనట అని పరాశరడు చెప్పెను. 

పురాణములలో చాయా సూర్యుల కుమారుడు శని. ఇతడు నల్లనివాడు. ఇతనికి చాయాసుతుడు , అసితుడు , అసితాంబరుడు అని పేర్లు. *ముంబైలోని శ్రీ శనీశ్వరాలయాలు* నెరళ్ (నవిముంబై) సెక్టార్-11లో శ్రీ శనీశ్వరాలయం ముంబైలో శ్రీ శనీశ్వర స్వామికి అనేక ఆలయాలు ఉన్నాయి. దేవనార్ లో ఒక శనీశ్వరాలయం ఉంది. మన్పాడ మార్గంలో దోంబివిలిలో ఒక చక్కని శని దేవాలయం ఉంది. ఇక్కడ ప్రతి శనివారం సాయంత్రం 8 గంటలకు శనికి హారతి ఇచ్చి స్తోత్త్రాలు పటిస్తారు. గాట్కోపర్ (తూర్పు) లో , నాగేశ్వర్ పశర్వంతి జైనమందిరం పక్కన , ఒక శని ఆలయం ఉంది. కళ్యాణ్ (తూర్పు) లోని కటేమనేవ్లిలో శని మందిరం ఉంది. కార్ వద్ద సర్వీసు మార్గంలో ఒక శని మందిరం ఉంది. బోరివలి (తూర్పు) లో గల జాతీయ ఉద్యానవనం దగ్గర శని మందిరం ఉంది. జోగేశ్వరి (తూర్పు) లో ఉండే ఆలయంలో , ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు శని మహాత్మ్యం కథ చదువుతారు.  నెరళ్ (నవిముంబై) సెక్టార్-11లో ఒక శనీశ్వరాలయం ఉంది. బాందూప్ లో శని మందిరం ఉంది. *ఇతర శని క్షేత్రాలు* శ్రీ శనైశ్చర దేవాలయం మంగళూరు (0824- 2252573) శని దోషం చూచిన లేదా శని మహా దశను అనుభవిస్తున్న వారు ప్రతి శనివారం మిక్కిలి భక్తితో ఎళ్ళేణ్ణే సేవె (కన్నడ భాషలో ఎళ్ళు అంటే నువ్వులు; ఎణ్ణె అంటే నూనె; సేవె అంటే సేవ) చేయటానికి ఈ ఆలయానికి విచ్చేస్తుంటారు. ఎళ్ళెణ్ణెసేవె (నువ్వుల నూనెతో సేవ) శనైశ్చరుడిని ప్రసన్నం చేసుకోవడానికి సోపానం అని ఇక్కడి వారి నమ్మకం. శ్రీ శనైశ్చర దేవాలయంలోని గర్భ గుడిలో గణేశ , దుర్గామాత మరియు శనైశ్చర స్వామి మూర్తులు ప్రతిష్ఠించ బడివున్నాయి. శనిగ్రహం దీర్ఘాయువు , దుర్భాగ్యము , దుఃఖము , వృద్ధాప్యం మరియు చావు , క్రమశిక్షణ , నియమం , బాధ్యత , కాలయాపనలు , గాఢమైన వాంఛ , నాయకత్వము , అధికారం , నిరాడంబరత , చిత్తశుద్ధి , అనుభవముచే వచ్చు జ్ఞానానికి కారకం లేదా సూచిక. శనిగ్రహం వైరాగ్యం , కాదనుట , అనురాగం లేకపోవుట , ఆత్మ స్వరూపత్వం , కష్టించి పనిచేయుట , సంవిధానం , వాస్తవికత మరియు సమయాలను కూడా సూచిస్తుంది.


*అసమానమైన లక్షణాలు:*


అపారమైన శక్తి , చెడు దృష్టి నుండి ఉపశమనం ఇవ్వమని కోరుతూ శనివారాలు ఈ శనిదేవుని దర్శనం చేసుకుంటారు.  


*శ్రీ శనీశ్వర కోవెల తిరునల్లార్:*


పాండిచ్చేరి సమీపంలో ఉన్న తిరునల్లార్ శనీశ్వరునికి అసమానమైన ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ నవగ్రహాల తొమ్మిది దేవాలయాల సమూహం ఉంది. శివుని అవతారమైన దర్బరన్యేశ్వర స్వామి ఉన్న ఈ కోవెలలో , శనీశ్వరుడు , ఒక గోడ గూటిలో కొలుఉన్నాడు. ఏల్నాటి శనిదశతో బాధింపబడుతున్న వారు , శనిగ్రహ దుష్ప్రభావం నుండి బయట పడటానికి భక్తులు ఈ గుడిని దర్శించి , ఇక్కడి నలతీర్థంలో స్నానంచేసి , ఆ తడివస్త్రాలతో స్వామి దర్శనం చేసుకున్నట్లయితే , శని ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. నల మహారాజు , తవ్వించిన కొలను ఈ గుడిలో భాగం. నల మహారాజు , ఇక్కడి కొలనులో స్నానం చేసి , గుడిలో పూజ చేసిన తరువాత , శని ప్రభావముచే అతను అనుభవిస్తున్న బాధలనుండి విముక్తి పొందినట్లుగా చెప్పబడింది. 


*శని ధామ్:*


శనిధామ్ , అని పిలువబడే ఈ ఆలయం చత్తర్ పూర్ కు సమీపమంలో , కుతుబ్ మినార్ నుండి 16 కిలోమీటర్ల దూరాన ఉంది. ఇక్కడ , 21 అడుగుల ఎత్తుగల అష్టధాతు మరియు ప్రకృతి సిద్ధమైన రాతితో చేయబడిన శననీస్వరుడి నిలువెత్తు విగ్రహం ఉంది. శనీస్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు , శనివారాలు ముఖ్యంగా అమావాస్య శనివారం అయితే , కాలసర్పం , సాడేసాతి మరియు దయాళిడికి (శివుడికి) ముఖ్య పూజలు చేస్తారు.


*వడ తిరునల్లార్ శనీశ్వర కోవెల:*


చెన్నైలో , మాంబళంలో ఉంది. ఇక్కడ శనీశ్వరుడు , సతీ (జేష్టాదేవిని ఇక్కడ నీలాంబికగా పిలవ బడుతూంది) సమేతుడై వెలిశాడు. విగ్నేశ్వరుడు , దుర్గ మరియు పంచముఖ హనుమాను ఉన్నారు.

 

*కుచనూరు:* మదురై దగ్గరలో , కుచనూరులో శనీశ్వరుడు , స్వయంభు సిందూరం రంగు విగ్రహం. కుబ్జుడు అన్నది , శనీశ్వరుడి నామల్లో ఒకటి. తమిళబాషానుసారంగా కుబ్జన్ ఉన్న ఊరు కుబ్జనూర్ , కాలాంతరంలో కుచ్చానూర్ అయింది. తూర్పు ముఖంగా గురుభగవానుడి ఆలయంతో బాటు క్రొత్తగా నిర్మింపబడిన ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ప్రసాదం ముందుగా కాకులకు సమర్పించి ఆతరువాత భక్తులకు పంచుతారు. ఒకవేళ కాకులు ప్రసాదమున తిరస్కరిస్తే , మళ్ళీ కొత్తగా ప్రసాదం చేసి , శనికి నివేదించి , కాకులకు మళ్ళీసమర్పిస్తారు.


*మందపల్లి:* తూర్పు గోదావరి జిల్లా , కొత్తపేటమండలానికి చెందిన గ్రామము. మందపల్లి గ్రామం రాజమండ్రికి 38 కి.మి., కాకినాడకు 60 కి.మి., అమలాపురంకు30 కి.మి., రావులపాలెంకు 9 కి.మి. దూరంలో ఉంది. ఈ గ్రామంలోనే ప్రసిద్ధి పొందిన శనీశ్వరాలయం ఉంది. ఈ దేవాలయం మందేశ్వరాలయంగా కూడా ప్రశస్తి పొందినది. మందపల్లి శనీశ్వర స్వామి ఇతర ఆలయాలకు కాస్తంత భిన్నం. వాస్తవానికి సోమేశ్వర స్వామి ఆలయం అయినా , శనీశ్వరుడు ప్రతిష్ఠించడంతో శనీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. శత్రు , రోగ , రుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. జాతక చక్రంలో శనితో సమస్యలున్నవారు కూడా వస్తుంటారు. ఏటా శ్రావణ మాసం లోనూ , శనిత్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Comments